జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ వేశారు. జెడ్పీ మైదానంలో నిర్వహించిన సంబురాల్లో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొని బతుకమ్మ ఆడారు. అలాగే జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వేడుకల్లో పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి పాల్గొని బతుకమ్మ ఆడారు. దేవరకద్ర మండలకేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి మంజుల పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు జయశంకర్కాలనీతోపాటు బాలానగర్, హన్వాడ, నవాబ్పేట మండలం కూచూర్, భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.