మహబూబ్నగర్, అక్టోబర్ 1 : అవసరమైన వయోవృద్ధుల ఇంటికే భోజనం పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మా ట్లాడారు. యవ్వన జీవతమంతా మన ఎదుగుదలకు కృషి చేశారని , ఇప్పుడు వారి సంక్షేమం కోసం సేవ చే యాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వయోవృద్ధుల కోసం పట్టణానికి సమీపంలోనే రెండెకరాల స్థలంలో వృద్ధాశ్రమం నిర్మిస్తామని తెలిపారు. పక్కనే అనాథ శరణాలయం కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వయోవృద్ధుల కోసం మహబూబ్నగర్ లో ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయాల ని, డాక్టర్తోపాటు ల్యాబ్ టెక్నీషియన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి గురువారం పీహెచ్సీలలో ప్రత్యేకంగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 64 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. రా త్రి, పగలు తేడా లేకుండా అభివృద్ధి కోసం కృషి చే స్తుంటే కొందరు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అందరి ఆశీర్వాదంతో పాలమూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
ఐలాండ్, నెక్లెస్రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం నిర్మాణాలు పూర్తయితే వృద్ధులు సేద తీరే అవకాశం ఉంటుందన్నా రు. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం మండలాల వా రీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అవసరమైన వా రికి ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి ఆదెరువు లేని వారికి శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటికే భోజనం అందిం చే చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన సాయం చేసేందుకు లైజనింగ్ అధికారిగా నాగరాజును నియమించినట్లు చెప్పారు. వయోవృద్ధులు సెల్ 94406 62543 నెంబర్ను సంప్రదించాలన్నారు. అనంతరం దళితబంధులో మంజూరైన కార్లను లబ్ధిదారులకు అందజేశారు. కొద్దిదూరం కారు నడిపి ఉన్నత స్థాయికి లబ్ధిదారులు చేరుకోవాలని కాంక్షించారు. అలాగే హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్లోని 42వ వార్డుకు చెందిన కేశవులుకు మంజూరైన రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కుటుంబ సభ్యులకు మంత్రి అందించారు. సీనియర్ సిటిజన్ గంగయ్యతోపాటు పలువురిని మంత్రి సన్మానించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకట్రావు, ముడా చైర్మన్ గంజి వెం కన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యా దవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాశ్, కౌన్సిలర్లు రాం లక్ష్మణ్, అనంతరెడ్డి, నాయకులు ఉన్నారు.
పథకాల్లో అవినీతి సహించం..
ప్రభుత్వ పథకాల మంజూరులో అవినీతి సహించమని మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కమలా గార్డెన్స్లో 19, 20, 40, 41 వార్డులోని లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను మంత్రి పంపిణీ చే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇతర పథకాల అమలులో ప్రజలను మభ్యపెట్టి అవినీతికి పాల్పడాలని చూస్తే వదిలిపెట్టేది లేదన్నారు. 2014 కంటే ముందు నెలకు 10,515 మందికి రూ.31 లక్షల పింఛన్లు ఇస్తుంటే.. నేడు 19,907 మందికి నెలకు రూ.4.24 కోట్లు పింఛన్ రూ పంలో ఇస్తున్నామన్నారు. పింఛన్లతో వృద్ధుల మోము లో ఆనందం వెల్లివిరుస్తున్నదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ము న్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు షబ్బీర్అహ్మద్, అనంతరెడ్డి, రఫీయాబేగం, మస్రత్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అర్షద్అలీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు అంజద్, ముంజిమిల్ పాల్గొన్నారు.