నెటవర్క్, నమస్తే తెలంగాణ;ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ఆయా జిల్లా కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వనపర్తి, మహబూబ్నగర్లో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ జెండావిష్కరించగా నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేటలో విప్ గువ్వల, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణ, స్టాళ్లు, కళాకారుల నృత్యాలు అందరినీ అలరించాయి. 57ఏండ్లు నిండిన వారికి కొత్తగా పింఛన్లు పంపిణీ చేశారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఊరూవాడా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పల్లె, పట్నం.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరి మది నిండా జాతీయభావం ఉప్పొంగింది. ప్రభాతభేరిలో విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. రహదారుల వెంట జాతీయ జెండాలతో ర్యాలీలు తీశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థుల విన్యాసాలు, నృత్యాలు అబ్బురపరిచాయి. మంత్రులు, ముఖ్య అతిథులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జెండాను ఎగరవేశారు.