మహబూబ్నగర్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడాలేని విధంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా వలసల జిల్లా అయి న పాలమూరు స్వరూపమే మారిపోయి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ఆబ్కారీ, క్రీడాశాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆలవెంకటేశ్వర్రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్పవార్తో కలిసి జాతీ య పతాకాన్ని ఎగురవేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయమే ఆధారంగా ఉన్న జిల్లాలో రైతులే కూలీలుగా మారిన పరిస్థితి ఉండేదన్నా రు.
తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఫలితంగా జిల్లా అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, ప్రాజెక్టులు, రహదారులు, రైల్వేలైన్ల నిర్మాణం, బైపాస్ రహదారులు, ఐటీపార్కు, మెడికల్ కాలేజీలో వసతుల కల్పన లాంటి పథకాలకు వేలకోట్లు వెచ్చించి జిల్లా స్వరూపమే మా ర్చామన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, రైతు వేదికలు దేశంలో ఎక్కడా లేవని కేవలం తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద 21,196 మంది లబ్ధిదారులకు రూ. 192 కోట్లు, మైనార్టీ, ఇతర వర్గాలకు 3,976మందికి రూ.35 కోట్లు అందించామన్నారు.
త్వరలోనే ‘పాలమూరు’ నీళ్లు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వెన రిజర్వాయర్ పూర్తయిందని, ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావొస్తుందని, కా లువల నిర్మాణం పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి చెప్పా రు. కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల కింద వేగంగా 11,093 ఎకరాలు భూసేకరణ చేసి రూ.582 కోట్ల నష్టపరిహారం చెల్లించామన్నారు. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు నాలుగులైన్ల రహదారికి రూ.30 కోట్లు చెల్లించామన్నారు. శిల్పారామం, సస్పెన్షన్ బ్రిడ్జి, లేజర్ లైటింగ్ వస్తే మినీట్యాంకు బండ్ స్వరూపమే మారిపోతుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబాలను సత్కరించారు. ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు రివార్డులను బహూకరించారు.