నాగర్కర్నూల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): పేదల అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, భారత స్వతంత్ర వజ్రోత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించడం జరుగుతోందని విప్ గువ్వల బాలరాజు అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గువ్వల ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన ఆయన భారీ సంఖ్యలో హాజరైన నాయకులు, అధికారులు, ప్రజలు, వి ద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఎం జీకేఎల్ఐ ద్వారా ఉప్పునుంతలలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.107.29కోట్లతో బ్రాంచ్ కెనా ల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చామన్నా రు. చంద్రసాగర్ ఫీడర్ ఛానల్ ద్వారా వెయ్యి ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చే పట్టనున్నామన్నారు.
బల్మూర్ మండలంలో ఉమామహేశ్వరం, చెన్నకేశవ రి జర్వాయర్లతో 57,200 ఎకరాలకు సా గునీరు అందించేందుకు రూ. 1534 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. రూ.76కోట్లతో మా ర్కండేయ ఎత్తిపోతల పథకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్స రం నుంచే 150మంది విద్యార్థులతో మెడికల్ కళాశాల ప్రారంభమవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజల సహకారంతో జిల్లా ను అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రంగా ల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కే సీఆర్ సహకారంతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ మనోహర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఉత్తమ సేవలు కనబరిచిన అధికారులకు ప్రశం సా పత్రాలతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.