మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 15 : సొంత తమ్ముడిని హతమార్చి జైలుకు వెళ్లివచ్చిన ఎర్రశేఖర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ను విమర్శించే నైతికహక్కు లేదని టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారి నీతులు వ ళ్లించడం సిగ్గుచేటని మహబూబ్నగర్ అర్బ న్ డెవలమెంట్ అథారిటీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు అ న్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ని యోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తు న్న మంత్రి శ్రీనివాస్గౌడ్పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. పట్టపగలు సొంత తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపి బిహార్ సంస్కృతికి బీజం వేశారని ఆ రోపించారు.
హత్యకేసు నుంచి బయటపడటానికి సాక్ష్యాలను తారుమారు చేయొచ్చేమోకానీ, ప్రజల మనస్సును మా ర్చలేరని స్పష్టం చేశారు. హత్యలకు పాల్పడే నీకు ప్రజల మధ్య రాజకీయాల్లో ఉండే అర్హ త లేదన్నారు. ఎన్నికలు వస్తేనే కనిపించే నీకు మంత్రిని విమర్శించే హక్కులేదన్నారు. మ రోసారి విమర్శలకు దిగితే సహించేదిలేదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. పాలమూరులో జరిగిన వెంకటయ్య ముదిరాజ్, రాజు, కట్టంకి రాములు హత్యలకు కారకులెవరో దమ్ముంటే ఎర్రశేఖర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి ముదిరాజ్, మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్ కిశోర్ముదిరాజ్, రామకృష్ణ ముదిరాజ్, పరమేశ్ ముదిరాజ్, శాంతన్నయాదవ్ ఉన్నారు.