మహబూబ్నగర్, ఆగస్టు 12 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి)/పాలమూరు : అనుబంధానికి ప్రతీకగా రాఖీ నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్త పింఛ న్లు, అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆమో దం తెలపడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పలువురు మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం జెడ్పీ మైదానంలో డీఆర్డీవో, జిల్లా సంక్షేమ శాఖ సంయు క్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్కు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ పేదలు అన్ని విధాలా బాగుపడాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా 10 లక్షల మందికి పిం ఛన్లు ఇస్తున్నారని తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేం ద్రాలు, ఒంటరి మహిళలకు, 57 ఏండ్లు దాటిన మహిళలకు, బాలామృతం, గర్భిణులకు న్యూట్రీషన్ ఫుడ్, కేసీఆర్ కిట్, బిడ్డ పుడితే పారితోషికం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే పార్లమెంట్లో ఈచట్టాన్ని ఆమోదించాలని సవాల్ విసిరారు. 57 ఏండ్లు దాటిన వారికి కొత్తగా ఫించన్లు ఇస్తామని హామీ ఇచ్చిన విధంగా కేసీఆర్ ఈ పంద్రాగస్టు నుంచి దీనిని అమలు చే స్తున్నారన్నారు. కులమతాలు లేని స మాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దేశంలో ఇంకా అక్కడకక్కడ మహిళలపై ఆకృత్యాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీంతో స్వా తంత్య్రం తెచ్చిన మహనీయుల ఆత్మలు శాంతించవని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరే లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మత రాజకీయం చేయొద్దని, దేశాభివృద్ధికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. పాలమూరు పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తుందని మంత్రి పేర్కొన్నా రు. అలాగే కౌమార దశ పిల్లలకు హెల్త్, న్యూట్రిషన్ కిట్లను మంత్రి పంపిణీ చే శారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, అదనపు కలెక్టర్ తే జస్ నందలాల్ పవార్, రెవెన్యూ సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, జి ల్లా సంక్షేమాధికారి జరీనాబేగం, ఆర్డీవో అనీల్కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ పాల్గొన్నారు.