నారాయణపేట రూరల్, ఆగస్టు 12: నారాయణ పేట మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి, అప్పక్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో సోదరులకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని శ్రీహంసవాహిని ఉన్నత పాఠశాలలో సామూహిక రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ప్రత్యేకంగా జాతీయజెండా రంగుల బెలూన్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో హెచ్.ఎం రాజేశ్కుమార్, ఉపాధ్యాయులు సంతోష్కుమార్, సుజాత, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన ఉద్యోగులు, వృద్ధులు
ఊట్కూర్, ఆగస్టు 12: ఊట్కూర్ మండలకేంద్రంలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మహాత్ములు కలలుగన్న భారతావని నిర్మాణమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కుల, మతాలకతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈనెల 14న మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే వివిధ సాంస్కృతిక, కళా ప్రదర్శన వేడుకల్లో మహిళలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గ్రామంలో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలువురు విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. పాఠశాల ఆవరణలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు రాఖీలు కట్టారు.
రాఖీలు కట్టిన మహిళలు
మండలకేంద్రంలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అధ్యక్షతన రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే చిట్టెం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. మండలంలోని అమీన్పూర్లో పలువురు వృద్ధ మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి నిండునూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, మండలప్రత్యేక అధికారి కృష్ణమాచారి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో కాళప్ప, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఎంఈవో వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, ఆగస్టు 12: మరికల్తో పాటుగా మండలంలోని అన్ని గ్రామాల్లో అక్కా చెల్లెళ్లు అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి మండలంలోని నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ, సర్పంచ్ గోవర్ధన్ పాల్గ్గొన్నారు.
ధన్వాడలో
ధన్వాడ, ఆగస్టు 12: ధన్వాడతోపాటుగా మండలంలోని ఎంనోన్పల్లి, గున్ముక్ల, రాంకిష్టయ్యపల్లి, కిష్టాపూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో, వివిధ పాఠశాలల్లో రాఖీ పండుగను జరుపుకొన్నారు. మహిళా కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఫ్లెక్సీలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలోని కేజీబీబీ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకులకు విద్యార్థినులు రాఖీలు కట్టారు. కా ర్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కో-ఆష్షన్ సభ్యులు వాహిద్, ఎంపీటీసీ సుధీర్కుమార్, మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు సునీల్రెడ్డి, ఉపాధ్యక్షులు సచిన్తదితరులు పాల్గ్గొన్నారు.
నర్వలో..
నర్వ, ఆగస్టు 12: మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం ప్రజలు రాఖీ పండుగను ఉత్సాహంగా నిర్వ హించుకున్నారు. అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి తమ తోబుట్టువులకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు అక్కాచెలెళ్లకు కానుకలు సమర్పించారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, ఆగస్టు 12 : అన్నాచెల్లెళ్ల ఆప్యాయ అను బంధానికి ప్రతీకైన రాఖీ పండుగను మండల కేంద్రం తోపాటు ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వ హించారు. అక్కాచెల్లెళ్లు వారి సోదరులకు రాఖీలు కట్టారు. సోద రులు తమ సోదరీమణులకు కానుకలు ఇచ్చారు. పుట్టింటికి మహిళలు చేరుకోగా ఆనందోత్సాహాల నడు మ పండుగ జరిగింది.
మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టిన మహిళా వీఆర్ఏలు
ఊట్కూర్, ఆగస్టు 12: మండలకేంద్రంలో పలువురు మహిళా వీఆర్ఏలు శుక్రవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టారు. గత కొద్ది రోజులుగా పేస్కేల్ అమలు కోరుతూ వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టిన విషయం విదితమే. ఈక్రమంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద మహిళా వీఆర్ఏలు కేటీఆర్ పటానికి రాఖీ కట్టి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని కలిసి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే ‘చిట్టెం’కు రాఖీ కట్టిన జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ
మక్తల్ టౌన్, ఆగస్టు 12: రాఖీలో ప్రేమానుబంధం ముడిపడి ఉందని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ ఎమ్మెల్యే చిట్టెంకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మక్తల్ 1వ వార్డు కౌన్సిలర్ శ్వేతావిష్ణువర్ధన్రెడ్డి, మాజీ వార్డు సభ్యురాలు. ధనలక్ష్మీనర్సింహులుగౌడ్, సం యుక్తారెడ్డి, మక్తల్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రా ధిక, కావలి సావిత్రమ్మతాయప్పలు చిట్టింకు రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదమ్ములు లేనివారు కూడా తమ సోదరులుగా భావించి ప్రేమానురాగాలను పంచే వారికిరాఖీలు కట్టి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు. మక్తల్ నియోజక వర్గంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.