ఊట్కూర్, సెప్టెంబర్ 28 : మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బతుకమ్మ చీరల పం పిణీ కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎ న్నో పథకాలు అమలు చేసిందన్నారు. మహిళలు, సం స్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడంలేదన్నారు. పని చేసే ప్రభుత్వానికి అన్నివర్గాల ప్రజలు అండ గా నిలవాలని కోరారు. అలాగే మండలంలోని చిన్నపొర్ల లో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమా ర్, ఉపసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఎంపీటీసీ లు, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్హ్రిమాన్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి శివరామరాజు, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు హనుమంతు, నాయకులు తదితరు లు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలు పంపిణీ
ప్రభుత్వం ప్రతి ఏ టా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తుందని సర్పంచ్ జయలక్ష్మి అన్నారు. మండలంలో ని ఖాన్దొడ్డిలో సర్పంచ్ ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో ఉపసర్పంచ్ అశోక్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కుమా ర్, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మహిళా సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేసి అండగా నిలుస్తున్నదని కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి అ న్నారు. మండలంలోని ఆ యా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు బుధవా రం ఆడపడుచులకు బతుక మ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ పం డుగలను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పండుగ కానుకగా సీఎం కేసీఆర్ అందిస్తున్న బతుకమ్మ చీరలతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, నాయకులు వీరేశ్గౌడ్, విజయభాస్కర్రెడ్డి, మోహన్రెడ్డి, బసిరెడ్డి, స ర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.