పాలమూరు, సెప్టెంబర్ 28 : మహబూబ్నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రకటనలో హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిన అక్రమార్కులను అదుపులోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు. పేదలెవరూ దళారుల బారిన పడి మోసపోవద్దని కోరారు. డబ్బులకు ఇండ్లు వస్తాయని భావిస్తే అది ముమ్మాటికీ మోసమే అని గ్రహించాలన్నారు.
ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్తో మాత్రమే ఇలా అవుతుందని అర్థం చేసుకోవాలన్నారు. ప్రభు త్వం నిజాయితీగా పేదలకు ఇండ్లు ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోయి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పేదలను మో సం చేసే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగినా, ఇప్పటికే ఇచ్చి మోసపోయినా వెంటనే పోలీసుల కు ఫిర్యాదు చేయాలన్నారు. అధికారులు సైతం నిఘా పెట్టాలన్నారు. మరోవైపు ఇప్పుటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో టేపుల అంశంతోపాటు డబుల్ బె డ్రూం ఇండ్లకు సంబంధించి వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎస్పీ, కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్లో సంక్షేమ పథకాలలో అక్రమాలు చే యాలంటేనే హడలిపోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు.