భూత్పూర్ మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన 50మందికి పైగా కాంగ్రెస్ నాయకులు ముడా డైరెక్టర్ సత్తూర్ చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మయ్య ఆధ్వర్యంలో అన్నాసాగర్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మదనాపురం/భూత్పూర్, అక్టోబర్ 17 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే భూత్పూర్ మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 50 మంది ముడా డైరెక్టర్ సత్తూర్ చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మయ్య ఆధ్వర్యంలో అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్నామన్నారు.
గ్రామాలాభివృద్ధిని కాంక్షించే ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారన్నారు. పార్టీకి నమ్మకంతో పనిచేస్తే.. మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో మదనాపురం గ్రామానికి చెందిన వడ్డె రవికుమార్, కొత్తపల్లికి చెందిన మంజునాథ్, వెంకటన్న, శ్యామల్, కురుమూర్తి, మొగులన్న, ఆంజనేయులు, మన్నెంతోపాటు మరో 50 మంది.., వార్డు సభ్యుడు సత్యనారాయణ, జంగయ్య, వెంకటేశ్, చెన్నయ్య, నాగరాజు, గణేశ్, బాలాజి, గోపి, పవన్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు యాదగిరి, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, నాగులు, శంకర్, నాయకులు లక్ష్మీకాంత్రెడ్డి, మనోహర్, చిన్నా తదితరులు ఉన్నారు.