మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 27 : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని ఎదిర 4వ వార్డులో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ గత పాలకులు కేవలం రూ.200 పింఛన్లు మాత్రమే ఇచ్చేవార ని, తెలంగాణ వచ్చాక రూ.2,016 ఇస్తున్నట్లు తెలిపారు. 2014కు ముందు మ హబూబ్నగర్లో 7,439 మందికి నె లకు రూ.32 లక్షల పింఛన్లు ఇచ్చేవార ని, నేడు 13,029 మందికి రూ.8.63 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఒకనాడు ఎ దిర అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని, ఫ్లోరైడ్ సమస్యతో స్థానికులు కష్టా లు పడేవారని గుర్తు చేశారు. నేడు అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రూ.9 కోట్ల తో తాగునీటిని తీసుకొచ్చామని, రోడ్లు, మౌలిక వసతులు కల్పించామన్నారు.
సమీపంలోనే ఐటీ కారిడార్ నిర్మించామని.. ఇందులో భూములు కోల్పోయి న వారికి అధికంగా రూ.12 లక్షల పరిహారం ఇచ్చామని తెలిపారు. త్వరలో ఐటీ కారిడార్ ప్రారంభిస్తామన్నారు. దీంతో 5,000 మందికి శిక్షణ ఇచ్చి, ఉ ద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఎదిరలో ప్లాట్ ధరలు బాగా పెరిగాయని, బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ తరహాలో మహబూబ్నగర్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అ నంతరం ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయి లో ఉత్తమ స్వచ్ఛ విద్యాలయంగా ఎంపి క కాగా హెచ్ఎం హేమచంద్రుడును మంత్రి సన్మానించారు. మూడు గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందగా సంబంధిత రైతు కిష్టయ్యకు రూ.1.20 లక్షల పరిహారం చెక్కును మంత్రి అందజేశారు. 4వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్లయ్య నివాసానికి వెళ్లి మంత్రి పరామర్శించారు. అంతకుముందు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటానికి వృద్ధులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్ యాదమ్మ, నాయకులు హన్మంతు, నర్సింహులు, రాములు, శివశంకర్, శ్రీనివాసులు, శేఖర్, వెంకటయ్యగౌడ్, హకీం, కృష్ణ, కాశన్న, సత్యం, అమర్, యాదిరెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.