నాగర్కర్నూల్, సెప్టెంబర్ 2: నాగర్కర్నూల్ మండలంలోని ప్రతి పల్లెలో శుక్రవారం ఆసరా పింఛన్ల పండుగ వాతావరణం నెలకొన్నదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్ల ప్రొసీడింగ్లను ఎమ్మెల్యే మర్రి జెడ్పీచైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మండలంలోని పుల్జాల, మల్కాపూర్, గగ్గలపల్లి, వెంకటాపూర్, మంతటి, వనపట్ల, శ్రీపురం, తూడుకుర్తి, గుడిపల్లి, పెద్దాపూర్, నర్సాయిపల్లి, ఆవురాసిపల్లిలో 823మంది లబ్ధిదారులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 46లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు ఆసరా పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పైరవీలు చేయకుండానే 57ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఆసరా పింఛన్ పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి అందజేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో అన్నివర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్ పథకాలపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. సర్కారు దవాఖానలో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్ అందజేస్తున్నదని, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు ఇస్తుందన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఉండాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీపీ నర్సింహారెడ్డి, సింగిల్విండో చైర్మన్ బండారు శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ మం డల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.