బాలానగర్ : ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకుని,రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
కంటికి కనిపించని కరోనా మహమ్మారిని అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసు కోవాలని కోరారు.18 ఏండ్లు పై బడిన వారందరూ వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ తులసి, రవి, తదితరులు ఉన్నారు.