భూత్పూర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను జాతీయ హరిత కమిటీ బృందం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ ఎస్ఈలు నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి భట్టుపల్లి శివారులోని 13వ ప్యాకేజీ లో ప్రతిమ కంపెనీలో ఎత్తిపోతలకు సంబంధించి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో ఎత్తి పోతలకు సంబం ధించి పూర్తి వివరాలను, చర్చించి, పత్రాలను సేకరించారు.
అనంతరం బృందం కట్ట వద్ద పనులను సైతం పరిశీలించారు. ఒండ్రు మట్టి, రాతి కట్టడం పనులను, ఇందుకు సంబంధిం చిన నమూనా పటాన్ని పరిశీలించారు. అనతంరం ఎస్ఈ నర్సింగరావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిగా చట్ట విరుద్దంగా నిర్మిస్తున్నారని ట్రిబ్యూనల్లో పిటిషన్ దాఖలు చేసినందున తనిఖీకి వచ్చినట్లు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొన్నట్లుగా పర్యావరణం ఎక్కడా దెబ్బతినే అవకాశం లేదని కమిటీ చెప్పింది. ఇదే నివేదికను కోర్టుకు అంద జేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, ఈఈ దయానంద్, మైనింగ్ ఏడీ విజయరామరాజు, ఆర్డీవో పద్మశ్రీ, డీఈలు విజయేందర్రెడ్డి, ప్రబాకర్రెడ్డి, సిద్దిఖ్, తాసీల్దార్ చెన్నకిష్టన్న, ఏఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.