దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చేరుతుండటంతో ఒక్క గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు.
ప్రాజెక్టులో 32.5అడుగులు( 2.25 టీఎంసీలు) నీరు ఉన్నదని, వరద ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటిని వదులుతున్నామని వెల్లడించారు.ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 32.6 అడుగులు( 2.27 టీఎంసీలు) అని పేర్కొన్నారు.