గుండుమాల్, నవంబర్ 23: అడవి జంతువు దాడి చేసి ఆవు దూడను చంపితిన్నది. ఈ ఘటన మంగళవారం కొమ్మూర్ గుండుమాల్ గుట్టల పరిసర పొలాల్లో పశువుల కొట్టంలో గుర్తు తెలియని అడవి జంతువు పశువుల మందపై దాడి చేసి అవుదూడను గుట్టపైకి లాక్కెళ్లి చంపితిన్నది. పశువుల యజమాని రాజు చూడగా దూడను ఓ జంతువు తిన్నదని సంబంధిత అధికారులకు సమచారం అందించాడు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంజీవరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి అడవి జంతువు మెకం దాడి చేసినట్లు నిర్ధ్దారించారు. గుట్టల ప్రాంతాల్లో ఇప్పటికీ రెండు అవు దూడలపై దాడి చేయడం జరిగిందని, చుట్టుపక్కల చిరుత పులి, మెకం ఉన్నట్లు పాద ముద్రలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిర్ధారణ అయ్యింది. పొలాల దగ్గర రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పశువులను ఇండ్లవద్ద కట్టేయాలని, మనుషులపై ఎలాంటి దాడి చేయవని, కనిపిస్తే సమాచారం ఇవాలని, అడవి జంతువులపై దాడి చేయరాదని, అయా గ్రామాల సర్పంచులకు ఊర్లో చాటింపు చేయించి రైతులను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో రైతులు వెంకట్రాములు, ఆనందం, హన్మంతు, కృష్ణయ్య, కేశవులు పాల్గొన్నారు.
బొమ్మరాశిపల్లిలో..
ఊర్కొండ, నవంబర్ 23: గుర్తు తెలియని జంతువు దాడి చేయడంతో రెండు లేగ దూడలు మృతి చెందిన ఘటన ఊర్కొండ మండలంలోని బొమ్మరాశిపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలో 15 రోజుల్లో ఎనిమిది మంది రైతులకు చెందిన పొలాల వద్ద ఉన్న లేగ దూడలపై రాత్రివేళ గుర్తు తెలియని జంతువు దాడి చేసి వాటిని చంపేపస్తున్నాయని అందులో కేవలం లేగ దూడల పైనే దాడి చేసి చంపి తింటున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారంరాత్రి కావలి సుల్తాన్, నాగేశ్గౌడ్కు చెందిన 3 దూడలపై దాడి చేయడంతో 2 మృతి చెందగా, ఒకటి తీవ్రంగా గాయపడింది. ఇప్పటికైనా ఫారెస్టు అధికారులు పకడ్బదీంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.