మరికల్: పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని నారాయణపేట జడ్పీ వైస్ చైర్ పర్సన్ గౌని సురేఖ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సురేఖ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా స్వచ్చందగా ముందుకు వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. 100 శాతం వ్యాక్సిన్ కోసం గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైస్ ఎంపీపీ రవికుమార్, గ్రామ సర్పంచ్ కస్పే గోవర్థన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, నాయకులు కోండన్న, ప్రవీణ్ తదితరులు వాక్సీన్ వేసుకున్నారు. ఈ కార్యాక్రమంలో ఎంపీడీవో యాశోదమ్మ, మండల కోఆప్షన్ సభ్యులు మతీన్, ఉప సర్పంచ్ శివకుమార్, నాయకులు హచ్ శ్రీనివాసులు రఘు, కమల్ తదితరులు పాల్గొన్నారు.