కల్వకుర్తి: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల నుంచి మండల కమిటీలు ఐక్యమత్యంగా పని చేయాలని ఎమ్మె ల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, గ్రామ కమిటీలు, సమన్వయ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీల టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మధు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మధు, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.