భూత్పూర్: మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే నివాసంలో గురువారం అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ గొల్ల చెన్నమ్మ జడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డును అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. తనతోపాటు మరో 10మంది చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.