భూత్పూర్: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని అన్నాసాగర గ్రామంలో ఎమ్మెల్యే నివా సంలో నియోజకవర్గంలోని కొత్తకోట మండల టీఆర్ఎస్ పార్టీ కమిటీ ని నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తే పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏరాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ట్లు ఎమ్మెల్యే తెలిపారు. మన సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందుతున్నాయని ఆయన తెలిపారు.
కొత్తకోట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వామన్గౌడ్, కొత్తకోట పట్టణ అధ్యక్షుడుగా బాబురెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గా పద్మనెహ్రూ, మైనార్టీ మండల అధ్యక్షుడుగా సయ్యద్ లాల్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడుగా శంకర్నాయక్, మండల మహిళా అధ్యక్షురాలుగా నిర్మలావెంకట్రెడ్డి, టౌన్ అధ్యక్షుడుగా డా.సాజిద్, పట్టణ మహిళా అధ్యక్షురాలుగా బీమా ప్రసన్నలక్ష్మీ, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా మంద ప్రశాంత్ లను ఏకగ్రీవంగా నియమించారు. నూతనంగా ఏర్పడ్డ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అభినం దించారు. కార్యక్రమంలో మండల, మున్సిపాలిటీ ప్రజాప్రతి నిధులతో నాయకులు విశ్వేశ్వర్, చెన్నకేశవరెడ్డి, సాక బాల్నారాయణ, వివిధ గ్రామాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.