అయిజ: 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులను ఆదేశిం చారు. గురువారం మండలం లోని ఉప్పల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ స్పెషల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కరోనా మహమ్మారి నిర్మూలనకై క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు.
అందులో భాగంగానే గ్రామస్థాయిలోనే వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.స్పెషల్ డ్రైవ్లో 18 ఏళ్లు నిండిన పెద్దలు, యువకులు, విద్యార్థులు కొవిడ్ టీకా వేసుకునేందుకు అవగాహన కల్పించాల న్నారు. వారం రోజులలో ప్రతి గ్రామంలో అర్హులకు వంద శాతం వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రా మాలలో కొవిడ్ టీకా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిం చాలన్నారు. కొవిడ్ టీకాతోనే కొవిడ్ వ్యాప్తి నివారణ సాధ్యమవు తుందని ఆమె పేర్కొన్నారు.
సర్పంచ్లు, ఎంపీటీసీల సహకారంతో గ్రామాలలో వంద శాతం టీకా వేయాలని సూచించా రు. వైద్యాధికారులు సెంటర్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రూపేందర్ సింగ్, తాసిల్దార్ యాదగిరి, ఎంపీ డీవో సాయిప్రకాశ్, మండల వైద్యాధికారి డాక్టర్ స్వరూపారాణి, సర్పంచ్ జయంతి, ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి, ఆర్ఐ లక్ష్మిరెడ్డి, ఎంపీహెచ్ ఈవో ఓబులేశ్వరయ్య, పంచా యతీ కార్యదర్శి తులసీ కుమార్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.