అయిజ: మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపాలిటీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మార్కెట్ ఆవరణతో పాటు పరిసరాల్లో గ్రీనరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమీపంలోని నాలాను పరి శుభ్రంగా ఉంచాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలోని వివాదాస్పద నిర్మాణంపై అధికారులతో చర్చించారు. అట్టి నిర్మాణంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శాఖా గ్రంథా లయంను సందర్శించారు.
అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. గ్రంథాల యంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అడిగి తెలసుకున్నారు. నూతన భవన నిర్మాణ కొరకు స్థలం కేటాయించాలని చైర్మన్ కలెక్టర్ను కోరారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవ న్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, తాసిల్దార్ యాదగిరి, ఆర్ఐ లక్ష్మిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్స య్య, ఏఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.