శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లు
ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల
నదీమతల్లికి పూజలు చేసిన పండితులు
ఇన్ఫ్లో 4,16,248, అవుట్ఫ్లో 1,16,159 క్యూసెక్కులు
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
ఎగువ నుంచి హోరెత్తుతున్న వరద
మహబూబ్నగర్, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. కృష్ణమ్మ బిరబిరా దిగువకు పరవళ్లు తొక్కుతున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారింది. బుధవారం సాయంత్రం ప్రాజెక్టు రెండు స్పిల్వే గేట్లు తెరిచారు. దీంతో 10 మీటర్ల మేర ఎత్తి న గేట్ల ద్వారా సాగర్కు 53,488 క్యూసెక్కులు పరవళ్లు తొక్కుతూ వెళ్లింది. తెలంగాణ పవర్హౌస్ నుంచి 35,315 క్యూసెక్కులు, ఏపీ పవర్ హౌస్ నుంచి 31,356 క్యూసెక్కులు వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో సాగుతున్నది. 4 లక్షల ఇన్ఫ్లో ఉండగా.. 43 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 4,01,276 క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, సుంకేసుల డ్యాంల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది.
ఈ సీజన్లో తొలిసారిగా శ్రీశైలం ప్రాజె క్టు గేట్లు ఎత్తారు. బుధవారం శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి గేట్లు ఎత్తి నీటి నాగార్జునసాగర్కు నీటి వి డుదల ప్రారంభించారు. సాయంత్రం 7 గంటలకు రెండు గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి 53,488 క్యూ సెక్కులను సాగర్కు వదిలారు. ఎగువ నుంచి జూ రాల, సుంకేసుల ద్వారా దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల భారీ వరద శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతున్నది. దీంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరిం ది. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు కృష్ణ మ్మ పరవళ్లు చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో జలకళతోపాటు సందర్శకుల తాకిడి పెరిగింది. 2007 తర్వాత మళ్లీ జూలై నెలలోనే శ్రీశైలం డ్యాం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇప్పుడే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా ఉత్పత్తి చేపట్టారు. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తు తం 882.10 అడుగులకు చేరింది. జూరాల, సుంకేసుల నుంచి స్థిరంగా 4 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తున్నదని అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ పవర్ హౌజ్ నుంచి 35,315 క్యూసెక్కులు, ఏపీ పవర్ హౌజ్ నుంచి 31,356 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 53,488 క్యూసెక్కులు మొత్తం కలిపి సాగర్కు 1,16,159 క్యూసెక్కులు వదిలారు.
జూరాలకు భారీగా ఇన్ఫ్లో..
జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా వస్తున్నది. రాత్రి 9 గంటలకు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 43 గేట్లు ఎత్తి 4,01,276 క్యూసెక్కులను శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. పవర్హౌస్ను నిలిపివేశారు. కాలువలు, గేట్ల ద్వారా కలిపి మొత్తం 4,04,378 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు బుధవారం సా యంత్రం 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అక్కడి నుంచి 4.10 లక్షల క్యూసెక్కులను జూరాలకు విడుదల చేశారు. ఈ సీజన్లో నారాయణపూ ర్ నుంచి 4 లక్షలకుపైగా వరద రావడం ఇదే తొలిసారి. అటు తుంగభద్ర నుంచి సైతం 80 వేల క్యూ సెక్కులకు పైగా వరద వస్తోంది. మొత్తంగా సుమా రు 5 లక్షల వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో శ్రీశైలం నుంచి క్రమంగా మిగతా గేట్లు సైతం ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
అయిజ, జూలై 28 : కర్ణాటకలోని ఆర్డీఎస్కు వరద పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తడంతో వరద భారీగా వస్తున్నది. బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 66,252 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 66,200 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.
సుంకేసుల డ్యాంకు..
రాజోళి, జూలై 28 : సుంకేసుల డ్యాంకు బుధవారం 80 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 21 గేట్లు ఎత్తి 79 వేల క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. వరద ఎక్కువగా ఉండడంతో డ్యాం దిగువన ఉన్న తూర్పు గార్లపాడు గ్రామ శివారులోని పంట పొలాలు నీట మునిగాయి.