బైపాస్ ఏర్పాటుతో మెరుగుకానున్న రవాణా వ్యవస్థ
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
దేవరకద్ర, మరికల్, మక్తల్లోనూ బైపాస్ రోడ్లు
హైవేతో మరింతగా విస్తరించనున్న పట్టణాలు
మహబూబ్నగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు జిల్లాకు మరో మణిహారం రాబోతున్నది. భారత్ మాల పథకం కింద 167 హైవేను విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. రహదారి విస్తరణ, పనుల కోసం రూ.1780 కోట్లు, భూసేకరణ కోసం రూ.417 కోట్లు.. మొత్తం కలిపి రూ.2,197 కోట్లతో పనులు చేపట్టనున్నారు. భూసేకరణ కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ కానున్నది. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి డీపీఆర్ను అందజేసింది. దీంతో జడ్చర్ల నుంచి దేవసూగూరు వరకు ప్రస్తుతం ఉన్న 30 మీటర్ల రోడ్డు 60 మీటర్లుగా ఏర్పడడంతోపాటు 89.98 కిలోమీటర్ల పొడవుతో విస్తరణ జరగనున్నది. నాలుగు ప్రాంతాల్లో మహబూబ్నగర్, మరికల్, మక్తల్, మాగనూరు వద్ద బైపాస్లు ఏర్పాటు కానున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 225.61 హెక్టార్లు, నారాయణపేట జిల్లాలో సుమారు 200 హెక్టార్ల భూ సేకరణ చేపట్టనున్నారు. ఈ పాలమూరుకు వరమాలగా మారనున్నది. దీంతో రవాణా సౌకర్యం మరింత మెరుగు పడనున్నది.
పాలమూరు రహదారులకు మహర్దశ చేకూరనున్నది. ఇప్పటికే జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు మహబూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జ డ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు ఏర్పాటు చే యనున్న భారత్మాల బైపాస్ రోడ్డుతో పట్టణం మ రింతగా విస్తరించే అవకాశం ఏర్పడింది. మహబూబ్నగర్తోపాటు దేవరకద్ర, మరికల్, మక్తల్ పట్టణాల్లోనూ ఏర్పాటు చేయనున్న భారత్మాల బైపా స్ రోడ్లతో లబ్ధి చేకూరనున్నది. అయితే పాలమూ రు బైపాస్ ఏర్పాటుపై కొందరి దుష్ప్రచారం కారణంగా పట్టణవాసులు ఆందోళనకు గురవుతున్నా రు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నుతూనే ఉంటారని.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
జడ్చర్ల – దేవసూగూరు హైవే విస్తరణ..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నుంచి రాయిచూ ర్ వెళ్లే 167వ నెంబర్ జాతీయ రహదారిని భారత్మాల పథకం కింద విస్తరించేందుకు రంగం సిద్ధమవుతున్నది. భూసేకరణ కోసం త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నది. ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రాష్ట్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించింది.
జడ్చర్ల నుంచి దేవసూగూర్ వరకు ప్రస్తుతం 30 మీటర్లు ఉన్న రహదారిని 60 మీటర్ల మేర విస్తరించి.. నాలుగు చోట్ల బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. భారత్మాల పథకం కింద జడ్చర్ల-రాయిచూర్ రహదారిని విస్తరించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించినా.. వివిధ కారణాలతో నిలిచిపోయింది. విస్తరణ కోసం మహబూబ్నగర్ జిల్లాలో 225.61 హెక్టార్లు, నారాయణపేట జిల్లాలో సుమారు 200 హెక్టార్ల భూములను సేకరించనున్నారు.
పాలమూరులో అతి పెద్ద బైపాస్..
జడ్చర్ల నుంచి దేవసూగూరు వరకు మొత్తం 89.98 కిలోమీటర్ల పొడవుతో రహదారి విస్తరణ చేపట్టనున్నారు. జడ్చర్ల నుంచి మరికల్ వరకు 44.41 కిలోమీటర్ల మేర హైవే విస్తరణ పనులు జరుగనున్నాయి. నారాయణపేట జిల్లాలో మరికల్ నుంచి కర్ణాటకలోని దేవసూగూరు వరకు 45.57 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టనున్నారు. రహదారి విస్తరణ, నిర్మాణ పనులకు రూ.1,780 కోట్లు, భూ సేకరణకు రూ.417 కోట్లు మొత్తం కలిపి రూ. 2,197 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ హైవే వెంట మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని 17 గ్రామాలపై నుంచి రహదారి వెళ్లనున్నది. మహబూబ్నగర్, మరికల్, మక్తల్, మాగనూరు వద్ద బై పాస్ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో అన్నింటికన్నా అతి పెద్ద బైపాస్ మహబూబ్నగర్లో నిర్మించనున్నారు. 13.5 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. ఈ బైపాస్ రాకతో మహబూబ్నగర్ పట్టణంలో ఇన్నాళ్లుగా ఎ దురవుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ ప డనున్నది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఏపీ నుంచి వచ్చే భారీ వాహనాలు, బస్సులు, ఇతర వాహనా లు ఈ బైపాస్ మీదుగా వెళ్లనున్నాయి. దూర ప్రాం తాలకు వెళ్లే వారికి కూడా పట్టణంలో రద్దీ లేకుండా నేరుగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని, కోదాడ రహదారిని చేరుకునే అవకాశం ఏర్పడనున్నది.
సులభంగా రాకపోకలు..
ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి కోదాడ నుంచి బళ్లారి సమీపంలోని హగరి వరకు విస్తరించి ఉన్నది. తెలంగాణ, కర్ణాటక, గోవాలను కలిపే అతి ముఖ్యమైన హైవే ఇది. విజయవాడ నుంచి మం త్రాలయం, హంపి వంటి పుణ్యక్షేత్రాలు, గోవా వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను ఈ హైవే కలుపుతుంది. కాగా, ఈ రహదారి విస్తరించడంతో ప్రయాణం మరింత సాఫీగా జరగనున్నది. 483 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మీదుగా మహబూబ్నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్, మాగనూరు మీదుగా వెళ్తుంది. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా వాసులకు రాయిచూర్తో సంబంధాలు ఎక్కువ. వ్యవసాయం, వ్యాపా ర, వాణిజ్య, విద్య, వైద్య అవసరాల కోసం రెండు జిల్లాల నుంచి నిత్యం రాకపోకలు కొనసాగుతుంటాయి. మక్తల్ నియోజకవర్గ ప్రజలు దవాఖానలు, ధాన్యం అమ్ముకునేందుకు.. నారాయణపేట కంటే రాయిచూర్కే ఎక్కువగా వెళ్తుంటారు.
ఇలా వెళ్లనున్నది..
భారత్మాల బైపాస్ రోడ్డు పాలమూరుకు వరమాల కానున్నది. జడ్చర్ల దాటిన తర్వాత ఐటీ పా ర్కు సమీపం నుంచి అంబట్పల్లి, వస్రాం తండా, కొత్త కలెక్టరేట్ సమీపం నుంచి అల్లీపూర్ మీదుగా ధర్మాపూర్ సమీపంలో రాయిచూరు రోడ్డుకు కలువనున్నది. భవిష్యత్లో కోదాడ-జడ్చర్ల మార్గంలో నూ విస్తరణలో భాగంగా ఏర్పాటయ్యే భారత్మాల బైపాస్ రోడ్డు ప్రస్తుతం ఏర్పాటు అవుతున్న అంబట్పల్లి వద్దే కలిపే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అందుకే ప్రస్తుతం సర్వే చేసిన మార్గం మేరకే భారత్ మాల బైపాస్ వెళ్లేందుకు మార్గం సుగమం అవుతున్నదని సమాచారం.
సర్వే మారుతుందంటూ ప్రచారం..
భారత్మాల సర్వే చేపట్టి పనులు ప్రారంభిస్తారని అనుకుంటున్న తరుణంలో కొందరు అభివృద్ధి నిరోధకులు సర్వే మారుతుందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశామని, వారు సర్వే ఆపేస్తామని చెప్పినట్లుగా క ట్టుకథలు అల్లుతున్నారు. ప్రతిపక్షాలకు చెందిన వా రు భారత్మాలపై ఫిర్యాదు చేస్తే కేంద్ర మంత్రి కే వలం ఈ అంశాన్ని పరిశీలిస్తామని మాత్రమే చె ప్పారు. దానికే కట్టుకథలు అల్లి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహబూబ్నగర్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు పనికట్టుకుని దుష్ప్రచారానికి దిగారని అ ధికార పార్టీ నేతలు అంటున్నారు. భారత్మాల ప ట్టణానికి సమీపంలో నుంచి వెళ్తే మరింతగా అభివృద్ధి చెందేందుకు, రాకపోకలకు ప్రయోజనకరంగా మారనున్నది. అలాకాకుండా భూత్పూర్ దాటిన తర్వాత ఎన్హెచ్-44 నుంచి వెళ్లాలని కొందరు చే స్తున్న డిమాండ్ చూస్తుంటే మహబూబ్నగర్ అభివృద్ధి వారికి ఇష్టం లేనట్లుగా ఉందని పాలమూరువాసులు అంటున్నారు. సర్వే ఏ మాత్రం మారదని, ప్రస్తుతం ఉన్న సర్వే 2017లో చేసిందని, ఆ ప్రకారమే పనులు ప్రారంభం అవుతాయని సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి.
భూములిచ్చేందుకు సిద్ధం..
భారత్మాల 2016 నుం చి వస్తుందని చెప్పారు. అం దుకోసం రిజిస్ట్రేషన్లు ఆపేశా రు. భారత్మాల వెళ్లే పరిధిలోని భూములను బ్లాక్ లి స్టులో పెట్టారు. మాకున్న 3 ఎకరాల 4 గుంటలు కూడా బ్లాకు లిస్టులో ఉన్నది. కొం దరు భారత్మాల ఆగుతుందని, భూత్పూర్ దాటి న తర్వాత వెళ్తుందని చెప్తున్నారు. మహబూబ్నగ ర్ పట్టణం దాటి వెళ్తే ఎవరికీ ప్రయోజనం ఉండ దు. రహదారి పరిధిలో భూములు లేని వారు కూడా రాజకీయం చేస్తున్నారు. అభివృద్ధి కోసం మేము భూములిచ్చేందుకు ముందుకు వచ్చాం.
రవాణా వ్యవస్థ మెరుగు పడుతుంది..
షేరిపల్లి వద్ద ఎనిమిది ఎ కరాల వ్యవసాయ భూమి ఉంది. మా పొలాల వద్ద స రైన రవాణా వ్యవస్థ లేదు. రోడ్లు లేవు. పల్లెటూరు ప్రాంతమైన ఇక్కడకు భారత్మాల రావడంతో రవాణా వ్యవస్థ మెరుగు పడుతుంది. కనీస సరైన రోడ్డు వసతి లేని ఈ ప్రాంతం బాగుపడుతుంది. మా భూములకు విలువ పెరుగుతుం ది. మహబూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ పెరగడంతోనే ప్రభుత్వం భారత్మాల బైపాస్ ఇచ్చిం ది. దానిని మహబూబ్నగర్ భూత్పూర్ మీదుగా తీసుకుపోవాలని అనడం దుర్మార్గం.
రైతులకు ప్రయోజనకరం..
మాకు ఆరెకరాలు ఉన్నది. మా సమీప రైతులకు 452, 453 సర్వే నెంబర్లలో 36 ఎకరాల భూమి ఉంది. ఎవరి భూములకూ బాట లేదు. భారత్మాల రహదారి వస్తుందని చెప్తున్నారు. హైవే వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం. మా పక్క పోంటి ఉన్న సుమారు 30 మంది రైతులకు భారత్మాలతో ప్రయోజనం ఉందని భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. భారత్మాల వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది.