జమ్మికుంట, జూలై 12: హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. సోమవారం స్వేరోస్ అనుబంధ సంఘం తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర నాయకుడు, దళితరత్న అవార్డుగ్రహిత అంబాల ప్రభాకర్ (మడిపల్లి), కాంగ్రెస్ జమ్మికుంట మండలాధ్యక్షుడు బల్గూరి రాజేశ్వర్రావు (గండ్రపల్లి) హైదరాబాద్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ వైపు నడిపించాయని ప్రభాకర్, రాజేశ్వర్రావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణరావు, నాయకులు సంజీవరెడ్డి, ప్రసాద్ ఉన్నారు.