నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్కు సతీవియోగం కలిగిన విషయం తెలిసిందే. బాజిరెడ్డి భార్య శోభారాణి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ నిన్న మృతిచెందారు. ఈవాళ శోభారాణి భౌతికకాయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.