అడ్డగూడూరు, జూలై 7 : గ్రామాల సమగ్రాభివృద్ధి కొరకే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తుంతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలో బొడ్డుగూడెం గ్రామంలో బుధవారం 4వ విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గ్రామంలో డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. ఇంటికి 6 మొక్క ల చొప్పున నాటాలన్నారు.
ముత్యాలమ్మ గుడి ప్రారంభం
మండలంలోని చిర్రగూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ గుడిని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలను ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో పూజించాలన్నారు. అదేవిధంగా మండలంలోని చిర్రగూడూరు గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ చిత్తలూరి హన్మంతరావు మాతృమూర్తి ఇటీవల మరణించడంతో బుధవారం ఆమె దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ జోసఫ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మండల కోప్షన్ మెంబర్ మాదాను ఆంథోని, తహసీల్దార్ రామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి కృష్ణ, ఎంపీడీవో చంద్రమౌళి, సర్పంచ్లు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురంలో…
సంస్థాన్ నారాయణపురం, జూలై 7 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని మండల స్పెషల్ ఆఫీసర్ మన్యానాయక్ అన్నారు. బుధవారం మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. ఈ సందర్భంగా రోడ్లు, మురికి కాలువలను శుభ్రం చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బండారి యాదగిరి, ఎంపీవో శశికళ, ఏపీవో ప్రశాంతి, జ్యోతి, సర్పంచ్లు సామల భాస్కర్, దోనూరి సుశీల, పాండురంగా నాయక్, శేఖర్రెడ్డి, వార్డు మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు.
రామన్నపేటలో…
రామన్నపేట, జూలై 7 : పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మండల ప్రత్యేక అధికారి బాల్సింగ్, ఎంపీడీవో జలేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఉత్తటూరు గ్రామంలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. వైకుంఠధామం పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పవర్డేలో భాగంగా మండల కేంద్రంలో ఏడీ పద్మ ఆధ్వర్యంలో విద్యుత్శాఖ వారు లూజ్లైన్ల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయించారు. సర్పంచ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ వార్డుల్లో శ్రమదాన కార్యక్రమం నిర్వహించి పిచ్చిమొక్కలను తొలగించారు. బోగారంలో సర్పంచ్ అంతటి పద్మారమేశ్ పల్లెప్రగతిలో పాల్గొని వాటర్ ట్యాంక్లను శుభ్రం చేయించారు. రోడ్డు వెంట మొక్కలను నాటారు. లక్ష్మాపురంలో వాటర్ లీకేజీ పనులను చేపట్టారు. నిదానపల్లి గ్రామంలో ఫాగింగ్ చేయించారు. విద్యుత్ ఏఈ నర్సింహ్మ, లైన్ ఇన్స్పెక్టర్ గంగుల సోమేశ్వర్రెడ్డి, లైన్మన్లు వేణు, సత్యం, చాంద్, యాదగిరి, సర్పంచ్లు గుత్తా నర్సిరెడ్డి, కోళ్ల స్వామి, ఉప్పు ప్రకాశ్, ఎంపీటీసీలు గొరిగే నర్సింహ్మ, రెహాన్, పారిజాత, గోగుపద్మా పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్లో…
చౌటుప్పల్ రూరల్, జూలై 7 : మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలోని డబుల్బెడ్రూమ్ ఇండ్ల ఎదుట బుధవారం మొక్కలు నాటారు. తెలంగాణ 7వ విడుత హరితహారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకు ముందు ఆ గ్రామ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థలం కూడా గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్కుమార్, తహసీల్దార్ గిరిధర్, ఎంపీడీవో రాకేశ్రావు, మండల ప్రత్యేకాధికారి శ్రీలక్ష్మి, స్థానిక సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ ఎం.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పట్టణాల అభివృద్ధికే ‘పట్టణ ప్రగతి’: మున్సిపల్ చైర్మన్
చౌటుప్పల్, జూలై 7 : పట్టణాల అభివృద్ధికే ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11వ వార్డులో ఆయన మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాందుర్గారెడ్డి, కౌన్సిలర్ పోలోజు శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కరించుకోవాలి : డీఈవో
బీబీనగర్, జూలై 7:పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని డీఈవో చైతన్యజైనీ అన్నారు. బుధవారం మండలంలోని గొల్లగూడెం, మగ్దుంపల్లి గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతిలో భాగంగా జరుగుతున్న పనులను, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. మగ్దుంపల్లి గ్రామం లో శిథిలావస్థలో ఉన్న పాత భవనాలను జేసీబీ వాహనంతో కూల్చివేయించారు. శానిటేషన్ పనులను త్వరగా చేయాలని, ఎలాంటి విద్యుత్ సమస్యలుఉన్నా పరిష్కరించుకోవాలన్నారు. సర్పంచ్ రమేశ్యాదవ్, పంచాయతీ కార్యదర్శులు మహేశ్, హర్శియాబేగం పాల్గొన్నారు. మండలంలోని రహీంఖాన్గూడలో పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనానికి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మంచాల రవికుమార్ శంకుస్థాపన చేసి మొక్క నాటారు. ఉపసర్పంచ్ రాపాక జంగయ్య, గ్రామ ప్రత్యేక అధికారి కిరణ్జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సునీత, వార్డు సభ్యు లు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధి హామీ పాల్గొన్నారు.