శంకర్, రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు దీనిపై ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. పైగా తమ సినిమా పూర్తి చేసే వరకు వేరే ప్రాజెక్ట్ చేయకూడదని మద్రాసు హైకోర్టులో భారతీయుడు 2 చిత్ర నిర్మాతలు కేసు ఫైల్ చేశారు. దీంతో శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్చరణ్తో సినిమాకు లైన్ క్లియర్ అయింది.
30 ఏళ్లుగా తెలుగు సినిమా వైపు చూడని శంకర్ ఇప్పుడు స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. దీని కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే చెప్పిన లైన్ కూడా నచ్చడంతో నిర్మాత దిల్ రాజు ఓకే చెప్పేశాడు. శంకర్ గత సినిమాల మాదిరిగా ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవు. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే శంకర్తో సినిమా అంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుందని అంతా ఫిక్స్ అవుతారు… కానీ రామ్ చరణ్తో సినిమాను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని చెప్పాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉండగా.. భారతీయుడు 2 సినిమాను ముందుగా పూర్తి చేయాలని శంకర్పై లైకా ప్రొడక్షన్ మద్రాసు కోర్టులో కేసు ఫైల్ చేసింది. అయితే తాజాగా ఈ కేసును మద్రాసు కోర్టు కొట్టేసింది. దీంతో ఈ సినిమాకు పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు భారతీయుడు 2 ఎలాంటి అడ్డంకి కాబోదు. లైకా ప్రొడక్షన్స్ భద్రతను సమకూర్చడానికి దాఖలు చేసిన దరఖాస్తు సహా అన్ని దరఖాస్తులను హై కోర్టు కొట్టివేసింది. దీంతో ఇప్పుడు శంకర్ తన పని తాను చేసుకుని పోవచ్చు. దాంతో త్వరలోనే రామ్ చరణ్ మేజర్ అప్ డేట్స్ బయటికి ఇవ్వనున్నాడు ఈ దర్శకుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమీర్ఖాన్ దంపతుల 15 ఏండ్ల వివాహ బంధానికి తెర
ముఖ్యమంత్రి కొడుకుతో ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి
మెహ్రీన్ కౌర్ కంటే ముందు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సినీ ప్రముఖులు వీళ్లే
కాజల్ గర్భవతా, ఇందులో నిజమెంత?
చిన్మయి గర్భవతి అంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫేమస్ సింగర్
ప్రగ్యాని రౌండప్ చేసిన బిచ్చగాళ్లు