మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. లబ్దిదారులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ వల్లే తమ సొంతింటి కల నిజమైందని ఆనంద భాష్పాలు రాల్చారు.