లూసిఫర్..మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్టర్ గా మారి రికార్డులు సృష్టించిన సినిమా. పొలిటికల్ థ్రిల్లర్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో వచ్చిన లూసిఫర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీంతో లూసిఫర్ ప్రాజెక్టుకు చాలా పాపులారిటీ వచ్చింది. తొలి సినిమాతో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న పృథ్విరాజ్ తన రెండో చిత్రాన్ని ప్రకటించాడు.
పృథ్విరాజ్ఈ సారి కూడా మోహన్ లాల్ లీడ్ రోల్లో ఈ మూవీ చేస్తుండటం విశేషం. టైటిల్ ను చాలా ఆసక్తికరంగా బ్రో డాడీ అని ఫిక్స్ చేశాడు పృథ్విరాజ్. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మరి పృథ్విరాజ్-మోహన్ లాల్ కాంబినేషన్ లో రెండోసారి వస్తున్న బ్రో డాడీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!