న్యూఢిల్లీ : కొవిడ్-19 టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ శుక్రవారం 154వ రోజుకు చేరగా.. 27 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రాత్రి 7 గంటల వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 27,20,72,645 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మూడో విడుత టీకా డ్రైవ్లో భాగంగా 18-44 ఏజ్ గ్రూప్లో 19,43,765 మందికి మొదటి, మరో 77,989 మందికి రెండో డోసు టీకా అందజేసినట్లు పేర్కొంది. మూడో దశ డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి మొత్తం 5,15,68,603 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఒకే రోజు 29,84,172 టీకా మోతాదులు వేయగా.. ఇందులో 26,24,028 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 3,60,144 మంది లబ్ధిదారులకు రెండో డోసు అందజేసినట్లు వివరించింది.