హైదరాబాద్ : ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గురువారం వెల్లడించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలతో పాటు పలు సెట్లను వాయిదా పడుతున్నాయి.
కరోనా లాక్డౌన్ కారణంగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జెఎన్టీయూ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ పరీక్ష దరఖాస్తు గడువు మే 18న ముగియాల్సి ఉండగా ఇప్పటికీ నాలుగుసార్లు పొడిగించారు. తాజాగా జూన్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎంసెట్ పరీక్షలు జూలై 5 – 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్ను అవసరాన్ని బట్టి నిర్వహించాలనుకుంటున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.