హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత క్రమక్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,492 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 13 మంది మరణించారు. 1,933 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 19,521 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 166, ఖమ్మంలో 129, నల్లగొండలో 115, రంగారెడ్డిలో 92, సూర్యాపేటలో 89, మేడ్చల్ మల్కాజ్గిరిలో 83 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.