బేగంపేట్ జూన్ 14: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఉత్సవాలను జూలై 25, 26వ తేదీల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం అరణ్య భవన్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని దేవాదాయశాఖ అధికారులు, దేవాలయం ఫౌండర్ సభ్యులు కలిశారు. జాతర వివరాలు, తేదీలను ఆయనకు వివరించారు. 11న అమ్మవారి ఘటోత్సవాలు, 25న బోనాలు, 26 రంగం వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈవో గుత్తా మనోహర్రెడ్డి తెలిపారు.