హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు డీఈవోలను బదిలీలు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఖమ్మం డీఈవోగా ఎస్.యాదయ్య నియామకం కాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డి, ఎస్సీఈఆర్టీ ఉప సంచాలకురాలిగా చైతన్య జైనీ, ఆమెకే యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్గా ఎస్.ఎస్.సూర్యప్రసాద్, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి డీఈవోగా సూర్యప్రసాద్కు అదనపు బాధ్యతలు. సంగారెడ్డి డీఈవోగా నాంపల్లి రాజేశ్, కరీంనగర్ డీఈవోగా సీహెచ్.వి.ఎస్.జనార్దన్రావు, రంగారెడ్డి డీఈవోగా పి.సుశీంద్రరావు, నారాయణపేట డీఈవోగా లియాఖత్ అలీ, వనపర్తి డీఈవోగా ఎ.రవీందర్, జోగులాంబ గద్వాల డీఈవోగా మహ్మద్ సిరాజుద్దీన్, జనగాం డీఈవోగా టి.రాముకు అదనపు బాధ్యలను ప్రభుత్వం అప్పగిస్తూ నిర్ణయం వెలువరించింది.