మన్సూరాబాద్, జూన్ 13: శివారు కాలనీల అభివృద్ధికి పక్కా ప్రణాళిక, లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో ఆదివారం పర్యటించి లెక్చరర్స్కాలనీలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, వీరన్నగుట్ట కాలనీలో చేపట్టిన డ్రైనేజీ ట్రంకులైన్ పనులు, సుష్మ నుంచి పెద్ద చెరువు మార్గంలోని వరదనీటి ట్రంకులైన్ పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో జరుగుతున్న వరదనీటి, డ్రైనేజీ ట్రంకులైన్ పనులను త్వరితగతిన పూర్తిచేసి రాబోయే వర్షా కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ నాయకురాలు శ్యామల కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల ఆమె భర్త మృతిచెందారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు కొసనం వెంకట్రెడ్డి, ప్రవీణ్ముదిరాజ్, కేకేఎల్ గౌడ్, రుక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్, జూన్ 13: హయత్నగర్ డివిజన్ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. హయత్నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమరెడ్డి ఆధ్వర్యంలో ఆయా కాలనీల ప్రజలు ఎమ్మెల్యేను ఆదివారం ఆయన నివాసంలో కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సహకారంతో హయత్నగర్ డివిజన్లో యూజీడీ పైపులైన్ నిర్మాణ పనుల కోసం రూ.2 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు. బంజారాకాలనీ కల్వర్టు నుంచి అంబేద్కర్నగర్ కాలనీ వరకు, బాతుల చెరువు కట్టకింద కట్ట మైసమ్మ కాలనీ నుంచి తిరుమలకాలనీ, ఆర్టీసీ మజ్దూర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ నుంచి మెయిన్ ట్రంక్లైన్ వరకు పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారని పేర్కొన్నారు. పర్వతనగర్, పద్మాలయ, షిర్డీనగర్, కట్టమైసమ్మ, ఆర్టీసీ మజ్దూర్ కాలనీలకు ఇంటర్నల్ లైన్కు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఆయా కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.