న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే వ్యాక్సినేషనే ఉత్తమ మార్గం.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చాయి.. ఆ జాబితాలో సెలియో నుంచి మెక్డోనాల్డ్… రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నాయి. ఆ ఆఫర్లేంటో ఓ లుకేద్దామా..
కార్పొరేట్ కంపెనీలు వస్తువుల కొనుగోళ్లపై రివార్డులు ఇస్తుంటే, బ్యాంకర్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం 24 కోట్ల మందికి పైగా అంటే సుమారు 22 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది.
వ్యాక్సినేసన్ పూర్తి చేసుకున్న వారికి పలు ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సినేషన్ కూడా మార్కెటింగ్కు ఒక అవకాశంగా మారింది. కస్టమర్లు చాలా కాలం తర్వాత షాప్లను సందర్శింపచేయడంలో కీలకం కానున్నదని హరీష్ బిజూర్ కన్సల్ట్స్ ఫౌండర్ హరీశ్ బిజూర్ చెప్పారు.
ఫ్రాన్స్ క్లాథింగ్ కంపెనీ సెలియో పౌరులకు ఆఫర్ల మెసేజ్లు పంపుతున్నది. ఒకవేళ వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు తమ షాప్లో వస్తువులు కొంటే 300 రివార్డు పాయింట్లు ఇస్తామని సెలియో పేర్కొంటున్నది. ఇది చూసిన వారంతా ఫస్ట్ డోస్ వేయించుకోవడానికి వేచి చూస్తున్నారు.
అలాగే యూకో బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు మదుపు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఇక రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్.. వ్యాక్సినేసన్ను ప్రోత్సహించేందుకు తమ ప్రొడక్టులపై 5 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది.
నార్త్ అండ్ ఈస్ట్ ఇండియా ప్రాంతాల్లో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న మెక్ డొనాల్డ్ సీవోవో రాజీవ్ రంజన్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి పిజ్జాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. సామూహిక వ్యాక్సినేషన్.. ప్రజా భద్రతలో కీలక బాధ్యత వహిస్తుందన్నారు. బిజినెస్ పురోభివ్రుద్ధి సాధిస్తుందన్నారు.