సిరిసిల్ల రూరల్, జూన్ 9: సిరిసిల్ల శివారులోని సర్దాపూర్లో గల నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు అధునాతనంగా రూపుదిద్దుకుని రాష్ర్టానికే తలమానికంలా మారిందని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం పరీశీలించారు. ఏర్పాట్ల తీరును కాంట్రాక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణం, సభకు వచ్చే వారికి వసతులు, భోజనాలు, తదితర విషయాలను చర్చించారు. పనులను త్వరితగతిగా పూర్తి చేయాలని సూచించా రు. ఈ నెల 11న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఈ మార్కెట్ కమిటీని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిరిసిల్ల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఆయన వెంట ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, టీ ఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిం దం చక్రపాణి, అధికారులు ఉన్నారు.
ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి : కలెక్టర్ కృష్ణభాస్కర్
సర్దాపూర్లోని నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ఆయన మార్కెట్ యార్డును సందర్శించి, ఏర్పాట్లను పరీశీలించారు. ఆధునిక హంగులు, ఆత్యాధునిక సదుపాయాలు, భారీ సామర్థ్యంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డులో పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి శాబొద్దీన్, సిబ్బంది ఉన్నారు