చిక్కడపల్లి, జూన్8: నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయంతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈ సన్నీ, వాటర్బోర్డు డీజీఎంలు చంద్రశేఖర్, మాధవి, మేనేజర్లు అఖిమ్, ప్రసాద్, జీహెచ్ఎంసీ ఏఈలు శ్రావణి, మురళీధర్, తిరుపతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజవవకర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు అధికారుల సమన్వయ లోపంతో నిలిచిపోయాయని అన్నారు. ప్రధానంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంలో డ్రైనేజీ సమస్య తలెత్తుతుందని వాటర్బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జైసింహ, పార్టీ సీనియర్ నాయకులు ముఠా నరేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, పరుశురామ్, ఆర్. మోజస్, శ్రీ నివాస్ గుప్తా, గుండు జగదీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.