నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 7: జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. డిచ్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 53 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని మెడికల్ ఆఫీసర్ సరిత తెలిపారు. కోటగిరి మండలంలోని పొతంగల్ పీహెచ్సీలో 184 మందికి, కోటగిరి దవాఖానలో 34 మందికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్గా రిపోర్టు వచ్చిందని డాక్టర్ సమత తెలిపారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్ గ్రామంలో సోమవారం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించినట్లు మండల విస్తీర్ణ అధికారి వై.శంకర్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య కార్యకర్త మమత, ఆశ కార్యకర్త జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 105 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ శుభాకర్ తెలిపారు. జక్రాన్పల్లి పీహెచ్సీలో 104 మందికి పరీక్షలు చేయగా ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు.
వర్ని సీహెచ్సీలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. మోపాల్ పీహెచ్సీలో 184 మందికి కరోనా పరీక్ష లు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ నవీన్ తెలిపారు.బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 30 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 110 మందికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 95 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఎడపల్లి పీహెచ్సీలో 101 మందికి పరీక్షలు ని ర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బో ధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం 171 మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేశారు. పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1300 మందిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
వీరందరికీ టీకాలు వేయిస్తామని మున్సిపల్ కమిషనర్ రామలింగం తెలిపారు. భీమ్గల్ పీహెచ్సీలో 161 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 21 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖాన, హౌసింగ్ బోర్డులోఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్, మండలంలోని దేగాం పీహెచ్సీలో సోమవారం 9 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, అయేషా ఫిర్దోస్, స్వాతి వినూత్న, అమృత్రాంరెడ్డి తెలిపారు. ఏరియా దవాఖానలో 38 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి, దేగాం పీహెచ్సీలో 187 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో 58 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, అనురాధ, చంద్రశేఖర్, ఆనవాల తెలిపారు. రెంజల్ పీహెచ్సీ, కందకుర్తి గ్రామ శివారులోని చెక్పోస్టు వద్ద 104 మందికి కొవిడ్- 19 పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్య సిబ్బంది తెలిపారు.