వరంగల్ అర్బన్ : వరంగల్ సెంట్రల్ జైలును జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది సందర్శించారు. మూడు, నాలుగు రోజుల్లో ఖైదీలందరిని తరలిస్తామని ప్రకటించారు. సెంట్రల్ జైలు స్థలంలో రీజనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జైలు స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు కేటాయించాలని మంత్రివర్గం కూడా నిర్ణయించింది. జైలు నిర్మాణం కోసం వరంగల్ శివారులోని ధర్మసాగర్ మండలంలో స్థలాన్ని సైతం గుర్తించారు. ఈ మేరకు ఖైదీల తరలింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది.