న్యూఢిల్లీ, జూన్ 2: మహీంద్రా అండ్ మహీంద్రా.. తమ కస్టమర్లకు బుధవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కరోనా ధాటికి కుదేలైన మార్కెట్లో తిరిగి ఉత్సాహం నెలకొనేలా పలు ఆకర్షణీయ పథకాలకు తెరతీసింది. ఇందులో భాగంగానే ‘ఇప్పుడు వాహనం సొంతం చేసుకోండి.. 90 రోజుల తర్వాత ఈఎంఐ చెల్లింపుల్ని మొదలు పెట్టండి’ అంటున్నది. ఈ కష్టకాలంలో కస్టమర్ల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ ఆఫర్ను తెచ్చామని ఈ సందర్భంగా మహీంద్రా స్పష్టం చేసింది.