మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
భైంసాలో వైకుంఠధామాలు, ఫౌంటేన్ల ప్రారంభం
భైంసా, జూన్ 2 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రూ.1.50 కోట్లతో నిర్మించిన వై కుంఠధామం, ఆయా చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన ఫౌంటేన్లను బుధవారంప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి ఏడేండ్లు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నా రు. ఇన్నేండ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ సంకల్ప బలమే కారణమని కొనియాడారు. కరోనా సంక్షో భ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నదన్నారు. పేదలు ఆకలి తో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి ప్రతి నెలా ఆరు కేజీల బియ్యాన్ని 15 కేజీలకు పెంచారని పేర్కొన్నారు. త్వరలో బాసర నుంచి నిర్మల్, నిర్మల్ టూ ముంబై వరకు ట్రిపుల్ వే జాతీయ రహదారి పను లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. త్వరలో నే సమీకృత మార్కెట్ సైతం ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం..
మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతమిస్తున్నట్లు ఎమ్మెల్యే విఠల్రెడ్డి తెలిపారు. ఇప్పటికే పట్టణంలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో భైంసా పట్టణాన్ని ముందుంచుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, నాయకులు మురళీగౌడ్, బామ్ని రాజన్న, ఫారూఖ్, తోట రాము, కమిషనర్ ఎంఏ అలీం, గాలి రవి, కపిల్ షిందే, బాలాజీ సూత్రావే, తదితరులు పాల్గొన్నారు.
కష్టకాలంలోనూ ఆగని పథకాలు..
లక్ష్మణచాంద, జూన్ 2 : కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ఆపడం లేదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మండంలోని రాచాపూర్ గ్రా మంలో 30 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం వడ్యాల్ గ్రామంలోని రాజరాజేశ్వర ఫంక్షన్హాల్లో లక్ష్మణచాంద, మామడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ముందుగా సబ్స్టేషన్ నిర్మాణ స్థలంలో సర్పంచ్ సాతం బొర్రవ్వతో కలిసి మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచాపూర్ గ్రామంలో రూ.1.30 కోట్ల తో 33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడబిడ్డలకు వరంగా మారయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాతం గంగా రాం, వడ్యాల్ సర్పంచ్ అట్ల లలిత, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ కవితారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.