నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 21వ రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు సడలింపు సమయంలో తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేసి ని బంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
n ఆలేరు టౌన్, జూన్ 1 : ఆలేరులో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు ఉదయం ఆరు గంటలకు తమ షాపులను తెరిచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు మూసేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేశారు. మినహాయింపు ఉన్న వాహనాలను రోడ్లపై అనుమతించి మిగతా వాటిపై కేసులు నమోదు చేశారు.
n మోత్కూరు , జూన్ 1 : మోత్కూరు, గుండాల మండలాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారం మోత్కూరు, గుండాల మండలాల్లో సడలింపు సమ యం తర్వాత వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసేసి లాక్డౌన్కు సహకరించారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మున్సిపాలిటీ కేంద్రంతో పా టు మోత్కూరు, గుండాల మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. భువనగిరి, నల్లగొండ, తిరుమలగిరి రూట్ల నుంచి రాకపోకలు సాగించిన వాహనాలను తనిఖీ చేశారు. గుండాల మం డల కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనదారులకు జరిమానాలు వేసి కేసులు నమోదు చేశారు. జనగామ, దేవరుప్పుల, మోత్కూరు, ఆలేరు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని, కొవిడ్ నిబంధనలు పాటించని బైక్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
రామన్నపేట, జూన్1: మండలంలో మంగళవారం లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు తమ షాపులను ఒంటి గంట వరకే మూసేశారు. ప్రజలు మధ్యాహ్నం రెండు తర్వాత ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
n ఆత్మకూరు(ఎం), జూన్1: మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ నిబంధనలను వ్యాపారులతోపాటు ప్రజలు పాటించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వా త ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేసి కేసులు నమో దు చేసినట్లు ఎస్ఐ ఎండీ ఇద్రిస్ అలీ తెలిపారు.
n సంస్థాన్ నారాయణపురం, జూన్1: మండలంలోని వ్యాపారులు మంగళవారం ఉదయం ఆరు గంటలకు తమ షాపులను తెరిచి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేశారు. ప్రజలు , వ్యాపారులు లాక్డౌన్కు సహకరిస్తుండటంతో మధ్యాహ్నం రెండు తర్వాత ప్రధాన, అంతర్గత రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ సుధాకర్రావు ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు.
n మోటకొండూర్, జూన్ 1: మండలంలో లాక్డౌన్ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ఎస్ఐ నాగరాజు లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. ప్రజలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సడలింపు సమయంలో అవసరమైన సరుకులు, వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం ఇంటికే పరిమితం అయ్యారు.