రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుతో సత్ఫలితాలు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్లో వ్యాక్సినేషన్, అభివృద్ధి పనుల పరిశీలన
నిర్మల్ టౌన్, మే 28 : కరోనా వైరస్ను ఆదిలోనే అంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే పూర్తి సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం నిర్మల్లోని కలెక్టర్ కార్యాలయం లో సూపర్ స్ప్రెడర్లకు అందించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ముందు చూపు, సీఎం కేసీఆర్ వ్యూహంతోనే కరోనా వైరస్ వ్యాప్తికి రాష్ట్రంలో అడ్డుకట్ట పడిందని పేర్కొన్నా రు. కరోనా వైరస్ కట్టడికి దేశంలో రాష్ట్రంలో లేని ఇంటింటా జ్వర సర్వేను ముఖ్యమంత్రి చేపట్టారని పేర్కొన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే వైరస్ లక్షణాలను గుర్తించి వారికి ప్రభు త్వం ఉచితంగా మందులు అందజేయడం తో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిందని తెలిపారు. ఇం టింటా సర్వేను కేంద్రం ప్రశంసించి మిగతా రాష్ర్టాలు సర్వే చేపట్టేందుకు చర్యలు సిద్ధం చేసిందని చెప్పారు. మరో పక్క లాక్డౌన్ను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుండడంతో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
సుందరీకరణ పనులతో మహర్దశ
నిర్బల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలో దాదాపు రూ. 6 కోట్లతో శివాజీ చౌక్ నుంచి గాజుల్పేట్ వరకు చేపట్టిన పట్టణ సుందరీకరణ పనులతో జిల్లాకు మహర్దశ వచ్చిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్లో చేపట్టిన అభివృద్ధి పనులను రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు పాదయాత్ర ద్వారా పరిశీలించారు. ఫుట్పాత్, రహదారి విస్తరణ, రెలింగ్, రూరల్ పోలీస్స్టేషన్ ప్రహరీ రోడ్డు, ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పనులను వేగంగా సాగుతుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రెట్టిం పు వేగంతో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.
కార్మికుల సేవలు వెలకట్టలేనివి
నిర్మల్ అర్బన్, మే 28 : కరోనా వైరస్ కట్టడిలో పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు టీఆర్ఎస్ నాయకుడు శ్రీహరి రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితు ల్లో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను చేపడుతున్న శ్రీహరి రావును మంత్రి అభినందించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ శ్రీహరిరావును సన్మానించా రు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎంహెచ్వో ధన్రాజ్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణ గౌడ్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్, కమిషనర్ బాలకృష్ణ, క్లాస్ వన్ కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, నాయకుడు అడ్ప పోశెట్టి, కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాల్క సురేశ్ మృతిపై సంతాపం
చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేశ్ మృతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సురేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.