రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్న నాకాబందీ
రిహద్దు చెక్పోస్టులను తనిఖీ చేసిన ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్
నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు సీజ్
ఖమ్మం, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 16వ రోజు గురువారం పకడ్బందీగా లాక్డౌన్ కొనసాగింది. నిత్యావసరాలు అవసరమైన వారు ఉదయం 6 నుంచి 10 గంటలలోపు మాత్రమే బయటకు వచ్చారు. ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ బోనకల్/వత్సవాయి సరిహద్దు చెక్పోస్ట్, మధిర రూరల్ పరిధిలోని మాటూరు చెక్పోస్టును తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బందికి సలహాలు, సూచనలిచ్చారు. నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ 16వ రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ప్రభుత్వం సడలించిన సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. గురువారం ఖమ్మం కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆంధ్రా – తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న్ల చెక్పోస్టులను సందర్శించి లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు. బోనకల్లు, వత్సవాయి సరిహద్దు చెక్పోస్టు, మధిర రూరల్ పరిధిలోని మాటూరు చెక్పోస్టును సీపీ సందర్శించారు. కూరగాయల మార్కెట్, పాలకేంద్రాలు, నిత్యావసర దుకాణాల వద్ద కొనుగోళ్లు యథావిధిగా కొనసాగాయి. 10 గంటల తర్వాత రహదారులపై వాహనాలతో సంచరించకుండా పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. ఆసుపత్రులకు వెళ్లే వాహనాలను మాత్రం తగిన పత్రాలను పరిశీలించి అనుమతించారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.