హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్తో ఇబ్బందుల్లో ఉన్న భారత మాజీ క్రికెటర్ స్రవంతి నాయుడుకు జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు అండగా నిలిచారు. కొవిడ్-19 బారిన బాడి కష్టాల్లో ఉన్న స్రవంతి కుటుంబానికి ఆయన గురువారం ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుత హైదరాబాద్లోని దవాఖానలో చికిత్స తీసుకుంటున్న ఆమె తల్లిదండ్రులకు తన వంతుగా రూ.2లక్షల సహాయం అందజేశారు. ఇక స్రవంతి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ రూ.6.77 లక్షలు, హెచ్సీఏ రూ.3 లక్షలు ఆర్థిక తోడ్పాటు అందించిన సంగతి తెలిసిందే.