చెన్నై : తమిళనాడులోని తిండివనంకు చెందిన ఓ డాక్టర్కు ఫేక్ రెమ్డెసివర్ ఇంజక్షన్ ఇవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఐ-మెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. డాక్టర్ రమణ్కు కరోనా సోకడంతో ఐ-మెడ్ ఆస్పత్రిలో చేరాడు. ఆ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సురేశ్ ఫేక్ రెమ్డెసివర్ ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో డాక్టర్ రమణ్ చనిపోయారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆ రెమ్డెసివర్ ఇంజక్షన్లను పుదుచ్చేరి నుంచి తెప్పించినట్లు విచారణలో తేలింది. ఆస్పత్రి ఇన్వాయిస్లో12 వయల్స్ మాత్రమే నమోదు చేసినట్లు ఉంది. కానీ ఆస్పత్రిలో మాత్రం 18 వయల్స్ లభ్యమయ్యాయి. బాధితులకు ఫేక్ రెమ్డెసివర్ ఇవ్వడంతో.. ఆ ఆస్పత్రికి అధికారులు రూ. లక్ష జరిమానా విధించారు. ఐ-మెడ్ ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు చికిత్స నిలిపివేయాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.