తిరుమల: లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 16 రోజుల పాటు నిర్వహించిన షోడశదిన సుందరకాండ దీక్ష మంగళవారం మహాపూర్ణాహుతితో ముగిసిందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో అదనపు ఈవో దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో ప్రస్తుతం నక్షత్రసత్ర మహాయాగం జరుగుతోందని, త్వరలో ధన్వంతరీ మహాయాగం నిర్వహిస్తామని తెలిపారు. నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణం పూర్తయిన తరువాత ఒకేరోజు అన్ని శ్లోకాలతో అఖండ పారాయణం నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత యుద్ధకాండ పారాయణం చేపడతామన్నారు. ఎస్వీబీసీ ద్వారా ప్రసారమవుతున్న ఇలాంటి కార్యక్రమాలను భక్తులు తమ ఇళ్లలోనే వీక్షించి అనుసరించాలని కోరారు.
కాగా, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థనా మందిరంలో శ్రీ రామ విశ్వశాంతియాగంలో భాగంగా కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు విశేష మంత్రాలతో సర్వకుండేషు విశేష ఉక్త హోమాలు చేపట్టారు.
తరం టిటిడి అదనపు ఈవో 32 మంది ఉపాసకులను శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం, సంభావన అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఎస్వీబీసీ సీఈవో సురేష్ కుమార్, వీజీవో బాలిరెడ్డి, హెచ్డీపీపీ కార్యనిర్వాహక మండలి సభ్యులు శ్రీ సుబ్బారావు ఇతర అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు.